ఐపీఎల్ 2023: విజేతగా నిలిచిన జట్టు ఎన్ని కోట్లు అందుతాయో తెలుసా?

ఐపీఎల్ 2023: విజేతగా నిలిచిన జట్టు ఎన్ని కోట్లు అందుతాయో తెలుసా?

-దాదాపు రెండు నెలల పాటు అభిమానులకు వినోదాన్ని పంచిన ఐపీఎల్ 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 28న ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచుతో ఈ టోర్నీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ విన్నర్, రన్నరప్‌గా నిలిచిన జట్లకు.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలకు ఎంత మొత్తం అందనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

గత సీజన్ మాదిరిగానే ఐపీఎల్ 2023 విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ లభించబోతోంది. రేపు జరిగే ఫైనల్లో గుజరాత్, చెన్నె జట్లలో విజేతగా నిలిచిన వారికి ఈ మొత్తం అందించనున్నారు. అలాగే రన్నరప్ నిలిచిన జట్టుకు రూ.13 కోట్ల మొత్తం అందనుంది. ఇక మూడో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ.7 కోట్లు అందనుండగా,ఎలిమినేటర్‌లో ఓడిపోయిన లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌కు 6.5 కోట్లు క్యాష్‌ రివార్డ్‌ అందనుంది.

ఆరెంజ్ క్యాప్‌తో పాటు రూ. 15 లక్షలు.. 

ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు ఆరెంజ్ క్యాప్ తో పాటు రూ. 15 లక్షల నగదు బహుమతి అందిస్తారు. ఈ జాబితాలో గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచులు ఆడిన గిల్‌.. 851 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో ఫాప్ డుప్లెసిస్(730), విరాట్ కోహ్లీ(639), డెవాన్ కాన్వే(625) ఉన్నారు. 

పర్పుల్ క్యాప్ బౌలర్‌కు రూ.15 లక్షలు.. 

ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ క్యాప్ తో పాటు రూ. 15 లక్షల నగదు బహుమతి అందిస్తారు. ఈ జాబితాలో ప్రస్తుతం మహ్మద్‌ షమీ(28) అగ్రస్థానంలో ఉండగా, రషీద్‌ ఖాన్‌(27), మొహిత్‌ శర్మ(24) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

ఎమర్జింగ్ ప్లేయర్‌కు రూ. 20 లక్షలు.. 

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు రూ. 20 లక్షలు నగదు బహుమతి అందిస్తారు. 1995 ఏప్రిల్ 1 తర్వాత జన్మించి.. ఐదు టెస్టుల కంటే తక్కువ, 20 వన్డేలు కూడా ఆడని ఆటగాళ్లు ఈ అవార్డుకు అర్హులు. అలాగే సదరు ఆటగాడు ఐపీఎల్‌లో 25 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. వీటితో పాటు ఈ సీజన్‌లో మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్‌కు రూ. 12 లక్షలు, పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌కు రూ.15 లక్షలు, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్‌కు రూ.15 లక్షలు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌కు రూ.12 లక్షలు లభించనున్నాయి.