
ఢిల్లీ : చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ పూర్తైంది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి147 రన్స్ చేసింది. రిషబ్ పంత్ భారీ స్కోర్ దిశగా ఆడేసమయంలో బ్రావో దెబ్బతీశాడు. 16 వ ఓవర్ లో టీమ్ స్కోర్ 120 దగ్గర పంత్ ఔట్ అయ్యాడు. పంత్ ఉన్నంతసేపు స్పీడ్ గా ఆడాడు. అతడు ఔట్ అయిన వెంటనే ఆ తర్వాత వచ్చిన కొలిన్ ఇన్ గ్రామ్ ను కూడా ఔట్ చేసి ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు బ్రావో. వెంటనే ధావన్ కూడా బ్రోవో బౌలింగ్ లోనే ఓట్ అయ్యాడు. దీందో లాస్ట్ 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఢిల్లీ.. 29 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఢిల్లీ ప్లేయర్లలో ..ధావన్(51), పంత్ (25), పృద్వీషా(24) తప్ప మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు.
చెన్నై బౌలర్లలో ..బ్రావో(3), ఇమ్రాన్ తాహీరో, జడేజా, చాహర్ తలో వికెట్ తీశారు.
Innings Break!
Clinical bowling from @ChennaiIPL restrict @DelhiCapitals to a total of 147/6 in 20 overs. In how many overs do you reckon will #CSK attain the target? #VIVOIPL #DCvCSK pic.twitter.com/YRSWzBudFf
— IndianPremierLeague (@IPL) March 26, 2019