
IPL-12 చివరి దశకు చేరుకుంది. చెన్నై, ముంబై, ఢిల్లీ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్కు చేరుకోగా..మరో బెర్తు కోసం హైదరాబాద్, కోల్ కతా, పంజాబ్ జట్లు పోటీ పడుతున్నాయి.అయితే హైదరాబాద్ జట్టుకే ప్లేఆఫ్కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్లేఆఫ్ సమరానికి తెరలేవనుంది. ఈ నెల 8, 10 తేదీల్లో విశాఖలోని ACA-VDCA అంతర్జాతీయ మైదానంలో ప్లేఆఫ్ మ్యాచ్లు జరగనున్నాయి. 8న ఎలిమినేటర్ మ్యాచ్, 10న క్వాలిఫైయర్-2 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మ్యాచ్ల టికెట్లు ఇవాళ్టి(శుక్రవారం) నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నట్లు ఆంధ్ర క్రికెట్ సంఘం తెలిపింది. టికెట్లు www.eventsnow.com వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.