క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ఇంట్రెస్టింగా చూపిస్తున్నారు. 23న జరిగే ఫస్ట్ మ్యాచ్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లి కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడనున్నాయి. అయితే మ్యాచ్ కు ముందే హీటు పుట్టించే టీజర్లను ఐపీఎల్ రిలీజ్ చేసింది. రెండు టీమ్స్ అభిమానులూ.. ధోనీ, కోహ్లి అనుకుంటూ పోటీలు పడి నినాదాలు చేస్తున్నారు. టీజర్ చివర్లో ధోనీ, కోహ్లి కూడా చాయ్ తాగుతూ.. మ్యాచ్ లో చూసుకుందాం అంటూ సవాలు విసురుకుంటారు. సరే అంటూ వెళ్లిపోతున్న ధోనీ.. లేట్ గా రాకు అంటూ కోహ్లికి ఓ సాఫ్ట్ వార్నింగ్ ఇవ్వడం హైలైట్ గా నిలిచింది.
Dhoni, Dhoni, @msdhoni or Kohli, Kohli, @imVkohli?
We can't wait for this battle of the greats. Match 1 of #VIVOIPL between @ChennaiIPL and @RCBTweets #GameBanayegaName pic.twitter.com/4ZzvAtZ8fa
— IndianPremierLeague (@IPL) March 14, 2019