
IRCTC News: భారతీయ రైల్వే సంస్థ తన తత్కాల్ టిక్కెట్ల బుక్కింగ్ విషయంలో టైమింగ్స్ మార్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మారిన కొత్త వేళలు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని వాటి సారాంశం. కొన్ని చోట్ల దీనికి సంబంధించిన టైమ్ టేబుల్ కూడా ఒకటి చక్కర్లు కొట్టడంతో దీనిపై భారతీయ రైల్వే సంస్థ స్పందించింది. దీనిపై ప్రయాణికులకు క్లారిటీ ఇచ్చేందుకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది.
ఐఆర్సీటీసి ఇచ్చిన అధికారిక క్లారిఫికేషన్ ప్రకారం సోషల్ మీడియాలో చెప్పినట్లు తత్కాల్ టిక్కెట్ బుక్కింగ్స్ విషయంలో ఎలాంటి మార్పులు జరగలేదని వెల్లడించింది. ఈ క్రమంలో తత్కాల్, ప్రీమియం తత్కాల్ ఏసీ, నాన్ ఏసీ టిక్కెట్ బుక్కింగ్స్ సమయాలు గతంలోవే కొనసాగుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఇ-తత్కాల్ టిక్కెట్లు సదరు రైలు ఆరంభ స్టేషన్ నుంచి ప్రయాణానికి ఒక్కరోజు ముందుగా బుకింగ్స్ కోసం అవకాశం కల్పించబడింది.
Some posts are circulating on Social Media channels mentioning about different timings for Tatkal and Premium Tatkal tickets.
— IRCTC (@IRCTCofficial) April 11, 2025
No such change in timings is currently proposed in the Tatkal or Premium Tatkal booking timings for AC or Non-AC classes.
The permitted booking… pic.twitter.com/bTsgpMVFEZ
తత్కాల్ టిక్కెట్లు బుకింగ్స్ వేళలను గమనిస్తే.. ఉదయం 10 గంటలకు ఏసీ 2A, 3A, CC, EC, 3E క్లాస్ ల కింద టిక్కెట్లను ప్రయాణికులు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే నాన్ ఏసీ SL, FC, 2S క్లాస్ ల కింద టిక్కెట్ల బుక్కింగ్ ఉదయం 11 గంటలకు ఓపెన్ చేయబడుతుందని ఐఆర్సీటీసీ పేర్కొంది. ప్రీమియంతో చివరి నిమిషంలో ప్రయాణానికి అవసకాశం కల్పించే తత్కాల్ టిక్కెట్లు ఫస్ట్ ఏసీలో అందుబాటులో లేవు. సెకండ్ క్లాస్ బేసిక్ ఛార్జీలో 10%, ఇతర కేటగిరీలకు 30% అదనపు ఛార్జీలు విధించబడతాయని ఐఆర్సీటీసీ పేర్కొంది. అలాగే కన్ఫమ్ చేయబడిన తత్కాల్ టిక్కెట్లకు చెల్లించిన రుసుము రిఫండ్ రాదని ప్రయాణికులు గుర్తించాలి.