మీరు ట్రైన్లలో జర్నీ చేస్తున్నారా..? అయితే..ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మేము హెచ్చరించడం లేదు. భయపెట్టడం కూడా లేదు.. జస్ట్ సూచన మాత్రమే. కేర్ లేస్ గా ఉన్నారో అంతే సంగతి. ఎలుకలు సంచరించిన ఫుడ్ను మీరు తెలియకుండానే ఎంతో ఇష్టంగా.. మరెంతో హాయిగా తిన్నారంటే మిమ్ముల్ని ఎవరూ కాపాడలేరు..
రైళ్లలో పంపిణీ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తుండడం చూస్తునే ఉంటాం. వింటూనే ఉంటాం. తాజాగా ఓ రైలు వంటగదిలో కనిపించిన సీన్స్ ప్రయాణికుల్లో, ఫుడ్ లవర్స్ లో ఆందోళన కలిగిస్తోంది. రైలు కిచెన్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
టెండూల్కర్ అనే వ్యక్తి ఈ మధ్య తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మడగావ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ప్రయాణించాడు. రైలు కిచెన్ (ప్యాంట్రీ) వైపుగా ఎలుకలు వెళ్లడాన్ని అతడు గమనించాడు. అక్కడున్న వంట గిన్నెలపై రెండు ఎలుకలు అటు ఇటు తిరుగుతుండడం చూశాడు. అంతేకాదు.. వండిన ఫుడ్ ఐటమ్స్ ను ఎలుకలు రుచి చూస్తుండడాన్ని చూశాడు. వెంటనే తన ఫోన్ కు పని చెప్పాడు. రైలులోని వంట గదిలో ఎలుకలు సంచరిస్తున్న విజువల్స్ ను తన ఫోన్ లో రికార్డు చేశాడు. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇంకేముంది.. ఆ వీడియో వైరల్ గా మారింది.
Also Read :- రూ.1కే శానిటరీ నాప్కిన్
Do Watch...
— मुंबई Matters™ (@mumbaimatterz) October 18, 2023
To provide hygienic & tasty food to passengers & to monitor Quality Control #IndianRailways have appointed ?Food Tasters ??inside Pantry Cars.
Pilot project inside Pantry Car of 11009 LTT Madgaon Express on 14th Oct 2023. pic.twitter.com/xM7m2330uS
ఈ ఘటనపై ఆర్ఫీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు టెండూల్కర్. వంటగదిలో ఎలుకల సంచారంపై ఐఆర్సీటీసీ (IRCTC) స్పందించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, కిచెన్ను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందికి అవగాహన కల్పించామని వివరించారు. మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఐఆర్సీటీసీ తెలిపింది.