ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఔషధ పథకం, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (PMBJP) కింద రూ.1 సువిధ శానిటరీ నాప్కిన్లను విక్రయించడంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. జూన్ 2018 నుంచి సెప్టెంబరు 30, 2023 వరకు జరిగిన అమ్మకాల డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో సువిధ విక్రయాలు సుమారుగా రూ. 7 కోట్లకు చేరుకున్నాయి. గుజరాత్ రెండవ స్థానంలో రూ. 6.36 కోట్ల విక్రయాలతో, కర్ణాటక (5.57 కోట్లు), కేరళ (4.72 కోట్లు), జార్ఖండ్ (3.19 కోట్లు) తర్వాతి స్థానంలో ఉన్నాయి.
నాప్కిన్ ధర రూ.1 మాత్రమే ఉన్నందున అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 10 స్టాండర్డ్ ప్యాక్ని రూ. 10కి విక్రయిస్తారు. దీని వల్ల న్యాప్ కిన్ ల ఉత్పత్తికి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోనూ డిమాండ్ ఊపందుకుంది.
Also Read :- మధ్యలోనే ఆగిపోయిన జెయింట్ వీల్.. 50మంది గాల్లోనే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేక బహుమతిగా మార్చి 8, 2018న ఈ పథకం ప్రారంభించారు. అప్పటి కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ప్రారంభించిన ఈ ఉత్పత్తి చాలా ప్రత్యేకమైనది. భారతదేశంలోని కొన్ని ప్రముఖ బ్రాండ్ల శానిటరీ న్యాప్కిన్లు అందుబాటులో లేకపోవడంతో పీరియడ్స్ సమయంలో మహిళల రుతుశుభ్రత, ఆరోగ్య భద్రత కల్పించడమే దీని వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.