IND vs ENG 2025: కోహ్లీ, రోహిత్‌లు లేకపోతేనే మంచిది.. వారి బ్యాటింగ్ ఘోరం: ఇర్ఫాన్ పఠాన్

IND vs ENG 2025: కోహ్లీ, రోహిత్‌లు లేకపోతేనే మంచిది.. వారి బ్యాటింగ్ ఘోరం: ఇర్ఫాన్ పఠాన్

శుక్రవారం (జూన్ 20) నుంచి ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. లీడ్స్ వేదికగా హెడ్డింగ్లీలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ క్లియర్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. మరోవైపు కుర్రాళ్లతో నిండిన భారత జట్టు ఎలా రాణిస్తారో ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్ లోని పిచ్ లు భారత యువ జట్టుకు అతి పెద్ద సవాలుగా మారనుంది. యువ కెప్టెన్ శుభమాన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ కు షాక్ ఇవ్వాలని భారత్ భావిస్తుంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం సొంతగడ్డపై భారత్ ను చిత్తు చేయాలని భావిస్తుంది. 

అనుభవజ్ఞులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత జట్టు బలహీనంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ తో  సిరీస్ కు ముందే రోహిత్, విరాట్ ఇద్దరూ కూడా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. దీంతో ఇంగ్లాండ్ పై భారత్ ఘోరంగా ఓడిపోతుందని ఇప్పటికే చాలామంది మాజీలు జోస్యం చెప్పారు. అయితే టీమిండియా మాజీఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం రోహిత్, కోహ్లీ లేని కనిపించదని తన భిప్రాయాన్ని తెలిపాడు.

Also Read :  ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్.. పరుగుల వీరుడికి ఈ సారైనా ఛాన్స్ ఇస్తారా..?

"రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం వల్ల భారత జట్టు ఓడిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వారిద్దరి లేని లోటు జట్టుపై పడదని నేను నమ్ముతున్నాను. గత ఏడాదిన్నర కాలంగా వారి ఆట ఘోరంగా ఉంది. వారి నుంచి మంచి ప్రదర్శనలు మిస్ అయ్యాయి. ఇద్దరూ బిగ్ ప్లేయర్స్. కానీ పర్ఫార్మెన్స్ బాగా లేదు. జట్టులో ఒక కొత్త ప్లేయర్ 20-25 సగటున పరుగులు చేస్తే అతను కోహ్లీ లేని లోటు తీర్చినట్టే. ఇటీవలే కాలంలో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 15 పరుగుల చొప్పున మాత్రమే పరుగులు చేశాడు".అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోలో అన్నాడు. 

ఈ సందర్భంగా కరుణ్ నాయర్ పై ప్రశంసలు కురిపించాడు. " నా అభిప్రాయం ప్రకారం, కరుణ్ నాయర్‌ను ఆడించడం మంచి ఎంపిక. ఎందుకంటే అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో గొప్ప ఫామ్‌లో కనిపించాడు. ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే సాయి సుదర్శన్ ముందుండవచ్చు. కానీ అది వైట్-బాల్ క్రికెట్‌లో. కరుణ్ నాయర్ రెడ్-బాల్ క్రికెట్‌లో క్రమం తప్పకుండా ప్రదర్శన ఇచ్చాడు" అని పఠాన్ గుర్తు చేశాడు.