కార్మికుడి గొంతులో గుచ్చుకున్న ఇనుప చువ్వ

కార్మికుడి గొంతులో గుచ్చుకున్న ఇనుప చువ్వ

కామారెడ్డి టౌన్, వెలుగు : ఓ బిల్డింగ్ పై పనిచేస్తున్న కూలి గుంతలో పడిపోవడంతో అతని గొంతులో ఇనుప చువ్వ గుచ్చుకుంది. కామారెడ్డి టౌన్  శివారులోని అడ్లూర్​పరిధిలో ఉన్న ధరణి టౌన్​షిప్​లో గురువారం ఈ ప్రమాదం జరిగింది. దోమకొండ మండలం అంబారీపేట్​కు చెందిన జనార్ధన్​   బిల్డింగ్​పై పనిచేస్తుండగా పక్కనున్న గుంతలో పడ్డాడు. 

ఆ గుంతలో ఇనుప చువ్వలు ఉండడంతో ఒక చువ్వ జనార్ధన్​ గొంతులోకి దిగింది. చుట్టుపక్కల వారు వెంటనే 108 అంబులెన్స్​లో జిల్లా హాస్పిటల్​కు తరలించారు. ఇక్కడ కటింగ్​ మెషీన్​ సాయంతో ఇనుప చువ్వ బయటకు తీశారు. మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం నిజామాబాద్ హాస్పిటల్​కు తరలించారు.