ఎక్స్​టెన్షన్​పై పని చేస్తున్న వారిని తొలగించండి

ఎక్స్​టెన్షన్​పై పని చేస్తున్న వారిని తొలగించండి

హైదరాబాద్, వెలుగు : ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​లో ఎక్స్​టెన్షన్​పై కొనసాగుతున్న ఇంజినీర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని డిపార్ట్​మెంటల్ ​ఇంజినీర్స్ కోరారు. శనివారం వారు జలసౌధలో  ​మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు, ఈఈలుగా రిటైర్​అయిన వారిని ఎక్స్​టెన్షన్​పై కొనసాగిస్తున్నారని తెలిపారు.

 దీనిద్వారా  ఆ తర్వాతి స్థానంలో ఉన్న వారికి ప్రమోషన్లు దక్కడం లేదన్నారు. ప్రమోషన్లు లేకపోవడంతో  డిపార్ట్​మెంట్ అభివృద్ధికి జూనియర్​ఇంజినీర్ల సేవలు కూడా పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎస్ఈలు ఏఎస్ఎన్​ రెడ్డి, విజయ భాస్కర్​రెడ్డి, ఈఈలు సుబ్రమణ్యప్రసాద్​, రవీందర్​, డీఈఈలు రాజేంద్రప్రసాద్, శైలేందర్, శ్రీనివాస్, ప్రతిమ, సౌజన్య, సరితారాణి, పల్లవి, అమృతరావు, కళాధర్ తదితరులు ఉన్నారు.