
హైదరాబాద్, వెలుగు : ఇరిగేషన్డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న ఇంజినీర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని డిపార్ట్మెంటల్ ఇంజినీర్స్ కోరారు. శనివారం వారు జలసౌధలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు, ఈఈలుగా రిటైర్అయిన వారిని ఎక్స్టెన్షన్పై కొనసాగిస్తున్నారని తెలిపారు.
దీనిద్వారా ఆ తర్వాతి స్థానంలో ఉన్న వారికి ప్రమోషన్లు దక్కడం లేదన్నారు. ప్రమోషన్లు లేకపోవడంతో డిపార్ట్మెంట్ అభివృద్ధికి జూనియర్ఇంజినీర్ల సేవలు కూడా పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎస్ఈలు ఏఎస్ఎన్ రెడ్డి, విజయ భాస్కర్రెడ్డి, ఈఈలు సుబ్రమణ్యప్రసాద్, రవీందర్, డీఈఈలు రాజేంద్రప్రసాద్, శైలేందర్, శ్రీనివాస్, ప్రతిమ, సౌజన్య, సరితారాణి, పల్లవి, అమృతరావు, కళాధర్ తదితరులు ఉన్నారు.