
భారతదేశంలో చాలా మంది యువతకు తరతరాలుగా డాలర్ డ్రీమ్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే అప్పోసొప్పో చేసైనా అమెరికా పోవాలే అక్కడ గట్టిగా సంపాదించి చిన్నగా గ్రీన్ కార్డ్ కొట్టి స్థిరపడాలనేది ప్లాన్. ప్రధానంగా ఈ రన్నింగ్ రేసులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు చాలా ఎక్కువగానే ఉంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అమెరికాలో ఉన్నారు అని చెప్పుకోవటానికి ఎక్కువగా ఇష్టపడుతున్న నేపథ్యంలో అసలు ఈ నిర్ణయం ఎంత వరకు లాభదాయకం అనే ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి.
అయితే ఈ అంశంపై దిల్లీకి చెందిన సుభాష్ చక్రబొర్తి అనే వ్యక్తి చేసిన రీసెర్చ్ ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. చాలా మంది అమెరికాలోని పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా భారతదేశంలో ఉద్యోగులకు వస్తున్న వేతనాలను తక్కువగా చూస్తుంటారు. దీనికి ప్రస్తుత రీసెర్చ్ శాస్త్రీయ ఆధారాలతో సమాదానం ఇచ్చింది. దీని ప్రకారం ఎవరైనా వ్యక్తి అమెరికాలో రూ.80 లక్షలు సంపాదిస్తూ పొందే జీవితాన్ని భారతదేశంలో కేవలం రూ.23 లక్షల సంపాదనతో పొందవచ్చని రీసెర్చ్ వెల్లడించింది.
►ALSO READ | Gold Rate: లక్ష దాటినా ఆగని పసిడి పరుగు.. హైదరాబాదులో తులం ఎంతంటే..?
ఐఎమ్ఎఫ్ నివేదిక ప్రకారం అమెరికా ఇండియా మధ్య పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఖర్చులు అదాయాలను పరిగణిస్తే అది 3:1గా ఉంది. ఉదాహరమకు భారతదేశంలో సహజంగా ఒక రెస్టారెంట్ భోజనం రూ.300 ఉండగా అమెరికాలో అదే రూ.1700 అవుతుంది. ఇక నెలకు ఇంటర్నెట్ బిల్ రూ.700కే ఇండియాలో దొరుకుతుంటే అమెరికాలో అది రూ.6వేలుగా ఉంది. అలాగే ఇంటి అద్దె రూ.50వేలు ఉండగా అమెరికాలో రూ.లక్ష 60వేలుగా ఉందని వెల్లడైంది.
అలాగే అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మెరుగైన ప్రజా సేవలు, టెక్నాలజీ, అవకాశాలతో పాటు మెరుగైన సోషల్ సెక్యూరిటీ కూడా ఉన్నట్లు చక్రబొర్తి వెల్లడించారు. ఇక పోతే హెల్త్ కేర్, విద్య, లీగర్ ప్రొటెక్షన్ వంటి ఖర్చులు కూడా రెండు దేశాల్లో చాలా తేడా ఉన్నాయి. అలాగే ప్రజలు ఉంటున్న ప్రాంతం, వారి అవసరాలకు అనుగుణంగా వారి జీవనశైలి ఖర్చులు మారుతుంటాయని వెల్లడైంది.