ISPL 2023: క్రికెట్‌ టీమ్స్ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరోలు

ISPL 2023: క్రికెట్‌ టీమ్స్ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరోలు

గల్లీ క్రికెటర్ల కోసం ఐపీఎల్ తరహాలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్‌పీఎల్) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మొత్త ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి షురూ కానుంది. ఈ టోర్నమెంట్‌లో బాలీవుడ్‌ స్టార్ హీరోలు పెట్టుబడులు పెడుతున్నారు. 

టెన్నిస్‌ బాల్‌తో ఆడబోయే ఐఎస్‌పీఎల్ టోర్నీలో ఆరు జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్‌లు తొలి సీజన్‌లో పోటీపడనున్నాయి. కాగా, వీటిలో ముంబై ఫ్రాంచైజీని బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ సొంతం చేసుకోగా..  శ్రీనగర్‌ టీమ్‌ను అక్షయ్‌ కుమార్‌, బెంగళూరు టీమ్‌ను హృతిక్‌ రోషన్‌ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరోలు తమ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాల్లో వెల్లడించారు.

ఇందులో పాల్గొనేది గల్లీ క్రికెటర్లే అయినా అంతా ఐపీఎల్ తరహాలోనే జరగనుంది. వేలం పాట.. అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌లు.. అధునాతన టెక్నాలజీ.. అబ్బురపరిచే కామెంటరీ ఇలా బోలెడన్నీ సంగతులు ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్ లు జరగనుండగా, అన్నీ ముంబై వేదికగానే నిర్వహించనున్నారు. 

ఐఎస్‌పీఎల్ వివరాలు

మొత్తం జట్లు: 6 (ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్)
మొత్తం మ్యాచ్‌లు: 19
వేదిక: ముంబై