ఆర్మీ, సైనికుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా, ఏ టైంలోనైనా పని చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు శత్రువుల ప్రాంతాల్లోకి వెళ్తుంటారు. అక్కడే వాళ్లతో తలబడుతుంటారు. అట్లాంటి టైంలో వాళ్లకు సాయం అత్యవసరం. అందుకే వాళ్లకోసం ఓ ప్రత్యేకమైన ట్రాకర్ను కనుగొన్నారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ పరికరానికి కావాల్సిన టెక్నాలజీని ఇస్రో రెడీ చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు అందించింది. అయితే ఇది సాధారణ చిప్సెట్, రిసీవర్ టెక్నాలజీ కాదని, ఐఆర్ఎన్ఎస్ఎస్ రెస్ట్రిక్టెడ్ సర్వీస్లో భాగమని తెలిసింది. సుమారు18 నెలలు కష్టపడి తయారు చేసిన ఈ టెక్నాలజీపై ఇప్పటివరకు ఇస్రో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ యాంటీ స్పూఫింగ్ టెక్నాలజీ.. నావిగేషన్ సేవలతో పాటు ట్రాకర్ను పెట్టుకున్న వ్యక్తి ఎక్కడున్నారో టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్తో తెలియజేస్తుందని సమాచారం. ఐఆర్ఎన్ఎస్ఎస్తో రెండు వైపులా రిపోర్టింగ్ చేసుకునేలా పరికరాన్ని రెడీ చేసేందుకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్నామని బీఈఎల్ వెల్లడించింది. మనకు సంబంధించి నౌకలు ఎక్కడున్నాయో తెలుసుకోవడంతో పాటు వాటి నుంచి సమాచారం కూడా దీని ద్వారా పక్కాగా తెసుకోవచ్చని పేర్కొంది. ఇక ట్రాకర్తో వన్ వేలో, వ్యక్తి, నౌక ఎక్కడుందో సమాచారం తెలుసుకోవచ్చని వివరించింది.
ఇస్రో టెక్నాలజీ..ఆర్మీ కోసం అదిరిపోయే ట్రాకర్
- దేశం
- February 5, 2020
లేటెస్ట్
- శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
- కామారెడ్డిలో పెరిగిన పోలింగ్
- వెలిచాల రాజేందర్ రావుదే విజయం : పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : విజయరమణారావు
- GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్
- ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- పోలింగ్ కేంద్రం వద్ద మహిళ ప్రచారం
- అనారోగ్యంతో కౌన్సిలర్ మృతి
- మస్తుగా తాగేసిన్రు..
- అవగాహన లేక.. పోలింగ్ రోజు తిప్పలు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!