ఏపీలోనూ ఐటీ కంపెనీలు పెట్టండి: మంత్రి కేటీఆర్

ఏపీలోనూ ఐటీ కంపెనీలు పెట్టండి: మంత్రి కేటీఆర్

ఐటీ రంగంలో భవిష్యత్ అంతా ద్వితీయ శ్రేణి నగరాలదేనని, వరంగల్ లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకు ఐటీ సంస్థలు రావాలని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.  ఎన్నారైలు, ఏపీలోనూ ఐటీ కంపెనీలు పెట్టాలని, కావాలంటే జగనన్నకు చెప్పి మీకు జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ (అక్టోబర్ 6) వరంగల్, హనుమకొండలో విస్త్రృతంగా పర్యటించిన కేటీఆర్  9వందల కోట్ల  విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు.  మణికొండ ఐటీ పార్కులో 40 కోట్ల రూపాయిలతో ఏర్పాటు చేసిన సాప్ట్ వేర్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

 భవిష్యత్ అంతా టైర్ టూ నగరాలదేనన్నారు.  తెలంగాణ ప్రభుత్వం స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి నగరాలు, పట్టణాలకు పరిశ్రమలు తీసుకువస్తోందని చెప్పారు.  తాజాగా తాను ప్రారంభించిన ఐటీ కంపెనీ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.  రాబోయే పదేళ్లలో హైదరాబాద్ కు వరంగల్ కు తేడా ఉండన్నారు.  బెంగళూరు ఐటీ రంగంలో 40 శాతం మంది తెలుగు వాళ్లే నంటూ... అక్కడి నుంచి వచ్చేందుక తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని తెలిపారు.  ఉన్నచోటే మనకు ఉపాధి దక్కాలి. కులం, మతం పేరుతో కొట్టుకోకూడదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.