బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ ..ట్రైనింగ్ ప్లస్ జాబ్ అంటూ నిరుద్యోగులకు వల

బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ ..ట్రైనింగ్ ప్లస్ జాబ్ అంటూ నిరుద్యోగులకు వల
  • ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూల్
  • డబ్బులతో పరారైన ఎన్ఎస్ఎన్​ఇన్ఫోటెక్ నిర్వాహకులు

మాదాపూర్, వెలుగు: ఏడాది కిందటే కంపెనీ తెరిచారు. ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వల వేశారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు వసూల్ చేశారు. ఆరు నెలలపాటు వర్క్​ఫ్రమ్ హోమ్ పేరిట ట్రైనింగ్​ఇచ్చి జీతాలూ ఇచ్చారు. ఆ తర్వాత అసలు సినిమా మొదలుపెట్టి జీతాలు ఇవ్వకుండా రోజులు గడుపుతూ బోర్డు తిప్పేసింది. దీంతో చేసేదేమీలేక బాధితులంతా లబోదిబోమంటూ పోలీస్​స్టేషన్​మెట్లెక్కారు. 

మాదాపూర్ ఇన్​స్పెక్టర్​కృష్ణమోహన్​ వివరాల ప్రకారం.. సిటికి చెందిన శ్రీనివాస్, స్వామి నాయుడు ఇద్దరు కలిసి ఏడాది కింద కొండాపూర్​లోని​గూగుల్ ఆఫీస్​పక్కనే ఎన్ఎస్ఎన్​ఇన్ఫోటెక్​పేరుతో ఐటీ కంపెనీ ప్రారంభించారు. శ్రీనివాస్​సీఈవోగా, స్వామినాయుడు డైరెక్టర్​గా కొనసాగుతూ.. తమ కంపెనీలో ఐటీ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున వసూల్ చేశారు. ఆరు నెలల పాటు వర్క్​ఫ్రమ్ హోమ్ పేరిట ట్రైనింగ్​ఇచ్చి జీతాలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి సగం మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా రోజులు గడుపుతూ వస్తున్నారు. 

నెల రోజుల క్రితం పలువురు ఉద్యోగులు తమ జీతాల కోసం ఆఫీస్​వద్దకు వచ్చి చూసేసరికి కంపెనీ క్లోజ్​చేసి ఉండడంతో మోసపోయినట్లు గుర్తించారు. కంపెనీ సీఈఓ, డైరెక్టర్, హెచ్​ఆర్​లను సంప్రదించినా స్పందించకపోవడంతో బుధవారం మాదాపూర్​పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

 ఇప్పటివరకు దాదాపు 20 మంది బాధితులు స్టేషన్​కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగం కోసం డబ్బులు కట్టిన బాధితులు 300 మంది వరకు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇన్​స్పెక్టర్​తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.