పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లోఐటీ సోదాలు

పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లోఐటీ సోదాలు

ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ దాడులు హల్ చల్ చేస్తున్నాయి.   తాండూరు బీఆర్ఎస్  అభ్యర్థి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి  ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.  తాండూర్, హైదరాబాద్ మణికొండలోని రోహిత్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.  రోహిత్ రెడ్డి నుంచి రూ.  20 లక్షలు ఆయన తమ్ముడు రితీష్ రెడ్డి  ఇంటినుంచి అధికారులు రూ.  24 లక్షలతో పాటుగా  పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.  దాదాపుగా 5 చోట్లలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.   ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరోవైపు  హైదరాబాద్ లోని పాతబస్తీలో  శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్‌ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.   కింగ్స్‌ గ్రూప్‌ ఓనర్‌ షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో  సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు  ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో  డబ్బులు సమకూర్చుతున్నట్లు అనుమానం రావడంతో దాడులకు దిగారు.