విశ్వాస పరీక్షపై గవర్నర్ను కలవనున్న బీజేపీ, షిండే వర్గం

విశ్వాస పరీక్షపై గవర్నర్ను కలవనున్న బీజేపీ, షిండే వర్గం

 మహారాష్ట్ర  రాజకీయ సంక్షోభం గంట..గంటకో ట్విస్ట్ తో  కీలక మలుపు తిరుగుతోంది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష పెట్టాలని బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు కీలక సమావేశం కానున్నారు. ఇవ్వాళ లేదా రేపు బీజేపీ  ఎమ్మెల్యేలు, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలవనున్నారు.ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిందని, బలాన్ని నిరూపించుకునేందుకు కోరేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నిర్వహణ కు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరనున్నారు కమలనాథులు.ప్రభుత్వం ఏర్పాటు కోసం బీజేపీ, శివసేన తిరుగుబాటు నేతల కసరత్తు  చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ విశ్వాశ పరీక్షకు ఆదేశిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది శివసేన.