యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఓ కీలక ప్రకటన చేసింది. హానర్స్ డిగ్రీ వ్యవధి నాలుగేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త విద్యా విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని యూజీసీ ఇది వరకే ప్రకటించింది. తాజాగా దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నాలుగేళ్ల కోర్సు చదివిన విద్యార్థులకు మాత్రమే హానర్స్ డిగ్రి ప్రదానం చేయనున్నట్టు తెలిపింది. విద్యార్థులు అవసరమైతే రీసెర్చ్ స్పెషలైజేషన్ను కూడా ఎంచుకోవచ్చని యూజీసీ స్పష్టం చేసింది. విద్యార్థులకు కోర్సు నాలుగో ఏడాదిలో స్పెషలైజేషన్కు సంబంధించిన సిలబస్ చదవాల్సి ఉంటుందని చెప్పింది. వీరికి రీసెర్చ్ స్పెషలైజేషన్తో హానర్స్ డిగ్రీ ఇస్తామని ప్రకటించింది.
మూడేళ్ల డిగ్రీని ఎంచుకునే విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తిచేయాల్సి ఉండగా.. హానర్స్ డిగ్రీని ఎంచుకున్నవారు మొత్తం 160 క్రెడిట్లు కంప్లీట్ చేయాలని యూజీసీ వెల్లడించింది. ఈ కోర్సుల్లో చేరినవారు ఏదైనా కారణంతో మూడేళ్లలోపు మానేస్తే, మళ్లీ కోర్సులో చేరే అవకాశం కల్పించనుంది. కోర్సు మానేసిన నాటి నుంచి మూడేళ్లలోపు ఎప్పుడైనా అదే కోర్సులో చేరి కంటిన్యూ చేయవచ్చని. మొత్తమ్మీద ఏడేళ్ల లోపు కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుందన్ యూజీసీ వెల్లడించింది. ఈ డిగ్రీలో మేజర్, మైనర్ స్ట్రీమ్ కోర్సులుంటాయని ప్రకటించింది. లాంగ్వేజ్ కోర్సులు, స్కిల్ కోర్సులు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, అండర్ స్టాండింగ్ ఇండియా, డిజిటల్ అండ్ టెక్నలాజికల్ సొల్యూషన్స్, హెల్త్ అండ్ వెల్నెస్, యోగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ కోర్సులు కూడా తీసుకోవచ్చని స్పష్టం చేసింది.