‘ఫిట్ ఇండియా’.. ఫ్రీడమ్ రన్

‘ఫిట్ ఇండియా’.. ఫ్రీడమ్ రన్

న్యూఢిల్లీ: హెల్దీ లైఫ్ స్టైల్ ను ప్రమోట్ చేసేందుకు ప్రారంభించిన ‘ఫిట్ ఇండియా రన్’ లో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) పాలుపంచుకుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పిలుపు మేరకు ఆదివారం ఫిట్ ఇండియా రన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా.. బార్డర్లు , ఇతర ప్రాంతాల్లో ఉన్న ఐటీబీపీ జవాన్లు ఈ రన్ లో పాల్గొంటారని అధికారులు చెప్పారు. పది కిలోమీటర్ల వాక్, రన్ లో ఆఫీసర్లు, బలగాలు పాల్గొంటారని వివరించారు. తమ క్యాంపుల చుట్టుపక్కల వారిని కూడా ఈ రన్ లో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్లలో బీఎస్ఎఫ్ శనివారం నుంచే ‘ఇండిపెండెన్స్ డే వాక్’ చేపట్టింది. ఐటీబీపీ, బీఎస్ఎఫ్ డీజీ ఎస్ దేశ్వాల్ కూడా పంద్రాగస్టు రోజు అమృత్ సర్ లో జవాన్లతో కలిసి నడిచారు.