
భద్రాచలం, వెలుగు : గిరిజన దర్బారుకు వచ్చిన అర్జీలను రిజిస్టర్తో పాటు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని ఐటీడీఏ పీవో బి.రాహుల్ తెలిపారు. సోమవారం మీటింగ్ హాలులో నిర్వహించిన గిరిజన దర్బారులో అర్జీలు స్వీకరించారు. ప్రతీ ఆదివాసీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు కృషి చేస్తామన్నారు.
దర్బారులో వచ్చిన ఆర్జీని సంబంధిత శాఖకు పంపుతున్నట్లు తెలిపారు. వీటి పరిష్కారానికి శ్రద్ధ చూపించాలని యూనిట్ ఆఫీసర్లను ఆదేశించారు. పోడు భూముల సమస్యలు, భూ సమస్యలు, స్వయం ఉపాధి, రుణాలు, రైతుబంధు, ఉద్యోగాలు కావాలంటూ ఆర్జీలు వచ్చాయి. ప్రస్తుతం వస్తున్న అన్ని పథకాలకు అర్హులైన వారిని ఎంపిక చేస్తున్నామని పీవో వివరించారు.
ఐటీడీఏలో కారుణ్య నియామకం
భద్రాచలం ఐటీడీఏలో కారుణ్య నియామకంలో భాగంగా సోమవారం గణేశ్ అనే యువకుడికి ఆఫీసు అసిస్టెంట్ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ను పీవో బి.రాహుల్అందజేశారు. ఉయిక లక్ష్మయ్య 30 ఏండ్ల పాటు ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేసి 2023లో అనారోగ్యంతో మరణించాడు. గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి శరత్ అనుమతితో ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగం కల్పించినట్లు పీవో తెలిపారు.