విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి : ప్రతీక్​ జైన్

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి :  ప్రతీక్​ జైన్

గుండాల, వెలుగు : విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదగాలలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్​ జైన్ అన్నారు. నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల గురుకులాల పాఠశాలల 7వ జోనల్ స్థాయి క్రీడలను అండర్ 14,15,19(బాలుర) క్రీడలను శుక్రవారం స్థానిక గురుకుల కళాశాలలో ఆయన ప్రారంభించారు.

అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి  మాట్లాడుతూ ఈ క్రీడలు మూడురోజుల పాటు నిర్వహిస్తారన్నారు. క్రీడాకారులు ఆటల్లో గెలుపొంది తమ పాఠశాలలకు గుర్తింపు తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్వో రాజు, తహసీల్దార్​ రంగా,  ఎంపీడీఒ సత్యనారాయణ,   ప్రిన్సిపాల్స్​ పీఈటీలు, సిబ్బంది పాల్గొన్నారు.