పోడు పట్టాలివ్వాలంటూ భద్రాచలంలో ఐటీడీఏ ముట్టడి

పోడు పట్టాలివ్వాలంటూ భద్రాచలంలో ఐటీడీఏ ముట్టడి

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాలో అర్హులైన పోడు సాగుదారులందరికీ పట్టాలివ్వాలని, గొత్తికోయలను ఎస్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్​లైన్​ ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం భద్రాచలం ఐటీడీఏను ముట్టడించారు. గోదావరి బ్రిడ్జి నుంచి ర్యాలీగా ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్​లైన్​ జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలివ్వాలని, సాగునీరందించాలని, గొత్తికోయల గ్రామాలకు రోడ్లు, తాగునీరు, కరెంట్​సౌకర్యం కల్పించాలన్నారు. ఉపాధి కల్పించి, ఊర్లను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించాలని, ఎస్టీ సర్టిఫికెట్లు ఇచ్చి పై చదువులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 

అన్ని ప్రభుత్వ సబ్సిడీ పథకాలు వర్తింపజేయాలని కోరారు. గత బీఆర్ఎస్​సర్కార్​హయాంలో 3 లక్షల ఎకరాలకు పట్టాలివ్వాలని లక్ష మంది పోడు సాగుదారులు దరఖాస్తు చేసుకోగా, 50వేల మందికి మాత్రమే ఇచ్చారన్నారు. అటవీశాఖాధికారులు వచ్చి పోడు భూములను లాక్కుంటున్నారన్నారు. అర్హులందరికీ పట్టాలివ్వాలన్నారు. జిల్లా లీడర్లు ప్రభాకర్, నూప భాస్కర్​, కంగాల కల్లయ్య, పోతుగంట లక్ష్మణ్​, తోడెం దుర్గమ్మ, భద్రాచలం డివిజన్​ లీడర్లు సాయన్న చరణ్​, మునిగెల శివ ప్రశాంత్​, పాలం చుక్కయ్య, సుజాత, శాంతక్క, మహేశ్వరి పాల్గొన్నారు.