మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే జాక్వెలిన్ ను ఈడీ నిందితురాలిగా పరిగణించింది.
రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లను మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడితో జాక్వెలిన్ కు సన్నిహిత సంబంధాలున్నాయని తేలింది. సుకేశ్ నుంచి ఖరీదైన బహుమతులు పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్ కు చెందిన 7 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది . జాక్వెలిన్ ను సుకేశ్ కు పరిచయం చేసిన పింకీ ఇరానీని కూడా అధికారులు విచారిస్తున్నారు .
Jacqueline Fernandez appears before Economic Offences Wing of Delhi Police in money laundering case
— ANI Digital (@ani_digital) September 14, 2022
Read @ANI Story | https://t.co/f9kTJ3IXaO#JacquelineFernandez #moneylaunderingcase #SukeshChandrashekhar #DelhiPolice pic.twitter.com/vCWzuOnylx