ఇండ్లు రానోళ్లు తిట్టుకోవద్దు : సి లక్ష్మారెడ్డి

ఇండ్లు రానోళ్లు తిట్టుకోవద్దు : సి లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు : డబుల్​ బెడ్రూం ఇండ్లకు లెక్కకు మించి అప్లికేషన్లు రావడంతో అందరికీ ఇండ్లు ఇవ్వలేదని, ఇండ్లు రానోళ్లు తిట్టుకోవద్దని జడ్చర్ల ఎమ్మెల్యే సి లక్ష్మారెడ్డి కోరారు. బుధవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో నిర్మించిన 120 డబుల్​ బెడ్రూం ఇండ్ల పట్టాలను మున్సిపల్​ చైర్​ పర్సన్​ దోరేపల్లి లక్ష్మీ రవీందర్​తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎర్ర గుట్టలో 560, కావేరమ్మపేటలో 120, బోయలకుంటలో 80 ఇండ్లు కట్టించి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తున్నామని, ఇందులో అర్హత ఉండి ఇండ్లు రాని పేదలు మిగిలిపోతే మిగిలిన ఇండ్లు ఇస్తామని చెప్పారు. జడ్పీ వైస్​చైర్మన్​ కోడ్గల్​ యాదయ్య, ప్రణీల్​చందర్, డీసీఎంఎస్​ చైర్మన్​ పట్ల ప్రభాకర్​రెడ్డి, వైస్​ చైర్ పర్సన్​ పాలాది సారిక రామ్మోహన్  పాల్గొన్నారు.