జీజేఎల్ఏ​ ప్రెసిడెంట్​గా జగదీశ్

జీజేఎల్ఏ​ ప్రెసిడెంట్​గా జగదీశ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్​అసోషియేషన్​ ప్రెసిడెంట్​గా జగదీశ్​ఎన్నికయ్యారు. హైదరాబాద్​నాంపల్లిలోని అసోసియేషన్ ​బిల్డింగ్​లో ఆదివారం ఎన్నికలు నిర్వహించగా, ప్రెసిడెంట్​గా మహేశ్వరం గవర్నమెంట్ జూనియర్​ కాలేజీకి చెందిన సీ. జగదీశ్, వైస్ ​ప్రెసిడెంట్ గా​మాడ్గుల గవర్నమెంట్ జూనియర్​ కాలేజీకి చెందిన సీహెచ్​ చైతన్య, జనరల్ సెక్రటరీగా కందుకూరు గవర్నమెంట్ జూనియర్​ కాలేజీకి చెందిన జీ. సైదయ్య ఎన్నికయ్యారు.