ముషీరాబాద్,వెలుగు : మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావు అన్నారు. ముస్లింల సంక్షేమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని, కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని ఆరోపించారు.
ఆదివారం భోలక్ పూర్ లోని అంజుమాన్ సొసైటీ ఆలిండియా స్క్రాప్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ముస్లింలు టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, కేశవ్, సమద్, చారి, నాగేంద్ర, ఖదీర్,అక్తర్ అలీ తదితరులు ఉన్నారు.