మోదీని ఆప్యాయంగా కౌగిలించుకున్న జగద్గురు

మోదీని ఆప్యాయంగా కౌగిలించుకున్న జగద్గురు

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా చిత్రకూట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ.. తులసీ పీఠానికి చెందిన జగద్గురు రామానందాచార్యుల ఆశీస్సులు తీసుకున్నారు. శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మధ్యాహ్నం చిత్రకూట్ చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో జగద్గురు రామానందాచార్యులు పీఎం మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.  

ALSO READ : దేశంలో ఉల్లి మంటలు : ముందుగానే అలర్ట్ అయిన సర్కార్

అనంతరం తులసి పీఠంలో అష్టాధ్యాయి భాష్య, రామానందాచార్య చరితం, భగవాన్ శ్రీ కృష్ణకి రాష్ట్రలీల అనే మూడు పుస్తకాలను కూడా మోదీ విడుదల చేశారు. ఆ తర్వాత తులసి పీఠ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. రామాలయాల్లో ప్రార్థనలు చేయడం తనకు ఆశీర్వాదం అని, జగద్గురువు రామానందాచార్యుల ఆశీస్సులు కోరినట్లు కూడా చెప్పారు. చిత్రకూట్ తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని అన్నారు.