ఈటల వ్యాఖ్యలే బీజేపీ స్టాండా : జగ్గారెడ్డి

ఈటల వ్యాఖ్యలే బీజేపీ స్టాండా :  జగ్గారెడ్డి
  • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ఇష్యూలో   కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్లీన్‌‌‌‌‌‌‌‌చిట్ ఇస్తూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలే బీజేపీ స్టాండా? అని పీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​జగ్గారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి గాంధీభవన్​ వేదికగా స్పందించారు.

‘‘కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆరే. దీనికి అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్​ బాధ్యత కూడా ఉంది. ఆయన బీఆర్ఎస్​లో ఉన్నప్పుడు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. బీజేపీ నేతలు కాళేశ్వరం కేసీఆర్​ ఫ్యామిలీకి ఏటీఎం అన్నారు. మరిప్పుడు కేసీఆర్​కు ఈటల క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో కిషన్​రెడ్డి ఏకీభవిస్తారా? ’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.