
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్కు క్లీన్చిట్ ఇస్తూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలే బీజేపీ స్టాండా? అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్జగ్గారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి గాంధీభవన్ వేదికగా స్పందించారు.
‘‘కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆరే. దీనికి అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బాధ్యత కూడా ఉంది. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. బీజేపీ నేతలు కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం అన్నారు. మరిప్పుడు కేసీఆర్కు ఈటల క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో కిషన్రెడ్డి ఏకీభవిస్తారా? ’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.