పంజాగుట్ట, వెలుగు. నిరుద్యోగులపై అక్రమ కేసులు పెట్టడం, వారిని అరెస్ట్చేయడం అన్యాయమని మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ అన్నారు. 19 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని, నిరుద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిరుద్యోగ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వానికి, అధికారులకు స్పష్టత లేదని ఆరోపించారు. కాంగ్రెస్కు పట్టం కట్టిన నిరుద్యోగుల చేతులకే నేడు బేడీలు వేస్తున్నారని.. అవే చేతులు ఓట్ల రూపంలో గద్దె దించుతాయని హెచ్చరించారు. జర్నలిస్ట్ విఠల్, నిరుద్యోగులు పాల్గొన్నారు.
