దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి

దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి
  • ప్రజలకోసం మోదీ, కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లారా

హైదరాబాద్, వెలుగు: సోనియా తెలంగాణ ఇవ్వడంతోనే కేసీఆర్ సీఎం అయ్యాడని.. దీంతో కేసీఆర్, ఆయన కుటుంబం ఎదిగిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలు కెళ్లిందని, ఇందిరా గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

దేశం కోసం ఇందిరా గాంధీ జైలుకు వెళ్లారని.. మోదీ, కేసీఆర్ ఏ రోజు అయినా ప్రజల కోసం, దేశం కోసం జైలుకెళ్లారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అధికారం పోగానే కేసీఆర్ గిలగిల కొట్టుకుంటుండని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ దళితులకు భూములు ఇచ్చిందని, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇచ్చిందన్నారు. వాజ్ పేయి సైతం ఇందిరా గాంధీని వీరనారి అని పొగిడారన్నారు.