
జగిత్యాల టౌన్, వెలుగు: ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు అందించే ఓపీ, వెల్ నెస్ సేవల్లో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వరుసగా ఏప్రిల్, మే నెలలో అగ్రగామి గా నిలిచిందని డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా డీఎంహెచ్వో ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సహకారంతోనే సాధ్యమైందని అన్నారు.
సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సేవలను కొనసాగించి జిల్లా ప్రజలందరికి మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఉప ఆరోగ్య అధికారి శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డా. సమరుద్దిన్,డా.శ్రీనివాస్, డా.అర్చన, డా.జైపాల్ రెడ్డి,తులసి,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.