
- జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్
రాయికల్/మల్లాపూర్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్సూచించారు. మంగళవారం రాయికల్, మల్లాపూర్పోలీస్స్టేషన్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు,స్టేషన్ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలన్నారు.
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బ్లూ కోల్ట్స్ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. నిరుద్యోగ యువత నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట ఎస్ఐలు సుధీర్రావు, రాజు, ఏఎస్ఐ దేవేందర్నాయక్ తదితరులు ఉన్నారు.