గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెంట్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ అశోక్కుమార్

గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెంట్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి  : ఎస్పీ అశోక్కుమార్
  • జగిత్యాల ఎస్పీ అశోక్​కుమార్

రాయికల్/మల్లాపూర్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని జగిత్యాల ఎస్పీ అశోక్​కుమార్​సూచించారు. మంగళవారం రాయికల్, మల్లాపూర్​​పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు,స్టేషన్ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలన్నారు. 

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బ్లూ కోల్ట్స్​ ,పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. నిరుద్యోగ యువత నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట ఎస్ఐలు సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, రాజు, ఏఎస్​ఐ దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు ఉన్నారు.