జైపాల్ రెడ్డి జయంతి.. నివాళులర్పించిన వివేక్ వెంకటస్వామి

జైపాల్ రెడ్డి జయంతి.. నివాళులర్పించిన వివేక్ వెంకటస్వామి

దివంగత జైపాల్ రెడ్డి నీతి, నిజాయితీలో జీవితకాలం రాజకీయాలు చేశారని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేంద్ర మాజీ మంత్రి కాకాతో జైపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో స్పూర్తి స్థల్ దగ్గర పూలు వేసి నివాళులర్పించారు వివేక్ వెంకటస్వామి, ఆయన తనయుడు విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణ సాధనలో జైపాల్ రెడ్డి కృషి మరువలేనిదన్నారు. ఆయన స్పూర్తిని కొనసాగించాలని చెప్పారు వివేక్ వెంకటస్వామి. 

కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్బంగా నివాళులర్పిస్తున్నారు నేతలు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో స్పూర్తి స్థల్ దగ్గర జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి , తుమ్మల, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులు, నేతలు జైపాల్ రెడ్డి ఘాట్ దగ్గర పూలు వేసిన అంజలి ఘటించారు.  తెలంగాణ ఏర్పాటులో కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పారు నేతలు. అన్ని వర్గాల అభివృద్ది కోసం పని చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు.