పార్లమెంట్ బిల్డింగ్​కు అంబేద్కర్ పేరు పెట్టాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

పార్లమెంట్ బిల్డింగ్​కు అంబేద్కర్ పేరు పెట్టాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంటరీ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ‌‌‌‌‌‌‌‌లోయర్ ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశానికి ఉత్తమ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ పేరు ప్రపంచ పటంలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే నూతన పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.