
- జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణలో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇందుకోసం వచ్చే నెల 2న ఢిల్లీలోని జంతర్మంతర్వద్ద ‘బీసీల పోరు గర్జన’ పేరుతో మహాధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుందారం గణేశ్చారి, శ్యామ్కురుమ, విక్రమ్ గౌడ్, బాలరాజు గౌడ్, కల్కచర్ల శ్రీనివాస్ముదిరాజ్ తో కలిసి ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్లను పెంచుతూ బిల్లు పెట్టినందుకు సీఎం రేవంత్రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఇతర రాజకీయ పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటం తెలంగాణలో పూర్తయిందని, ఇప్పుడు దానిని ఢిల్లీకి విస్తరిస్తున్నామని వెల్లడించారు. ఈ ధర్నాకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి బీసీ దండు ఢిల్లీకి హాజరవుతుందన్నారు.