
భద్రాచలం, వెలుగు : జల్ జీవన్జలశక్తి మిషన్పనులను సరిగా చేపట్టాలని మినిస్టరీ ఆఫ్ జలశక్తి అడిషనల్ సెక్రటరీ కమల్ కిశోర్ ఆదేశించారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 16 జిల్లాల కలెక్టర్లతో ఆయన జిల్లాల వారీగా మిషన్ భగీరథ ద్వారా చేపడుతున్న పనులపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మారుమూల ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సరిగా నిర్వహించాలని, జనాభా ఆధారంగా ట్యాంకుల నిర్మాణం, నీటి సరఫరా ఉండాలని పలు సూచనలు చేశారు.
కాగా, భద్రాచలం పీవో రాహుల్ మాట్లాడుతూ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 8 పీటీజీ హాబిటేషన్లలో 365 గ్రామాలకు కనెక్షన్లు ఇచ్చామని, రూ.25లక్షలతో ట్యాంకు నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, మిషన్భగీరథ గ్రిడ్ఈఈ నళిని, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేశ్, ఏఈ రాము తదితరులు పాల్గొన్నారు.