జల్జీవన్ జలశక్తి మిషన్ నిర్మాణాలు సరిగా చేపట్టాలి :  కమల్ కిశోర్

జల్జీవన్ జలశక్తి మిషన్ నిర్మాణాలు సరిగా చేపట్టాలి :  కమల్ కిశోర్

భద్రాచలం, వెలుగు : జల్ జీవన్​జలశక్తి మిషన్​పనులను సరిగా చేపట్టాలని మినిస్టరీ ఆఫ్​ జలశక్తి అడిషనల్ సెక్రటరీ కమల్​ కిశోర్​ ఆదేశించారు. అరుణాచల్​ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 16 జిల్లాల కలెక్టర్లతో ఆయన జిల్లాల వారీగా మిషన్​ భగీరథ  ద్వారా చేపడుతున్న పనులపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మారుమూల ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సరిగా నిర్వహించాలని, జనాభా ఆధారంగా ట్యాంకుల నిర్మాణం, నీటి సరఫరా ఉండాలని పలు సూచనలు చేశారు.

కాగా, భద్రాచలం పీవో రాహుల్​ మాట్లాడుతూ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 8 పీటీజీ హాబిటేషన్లలో 365 గ్రామాలకు కనెక్షన్లు ఇచ్చామని, రూ.25లక్షలతో ట్యాంకు నిర్మాణానికి ప్లాన్​ చేస్తున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, మిషన్​భగీరథ గ్రిడ్​ఈఈ నళిని, ఆర్​డబ్ల్యూఎస్​ ఈఈ తిరుమలేశ్, ఏఈ రాము తదితరులు పాల్గొన్నారు.