జమ్ము కశ్మీర్లోని చిన్నారులంతా భారత జాతీయులేనని స్పష్టం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. వారిని వేరే రకంగా చూడకూడదని చెప్పారు. వారిని సరైన మార్గంలో కాకుండా కొన్నిసార్లు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని ఆరోపించారు. వారిని తప్పుడు మార్గంలో నడిపించే వారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని… చిన్నారులు, యువతపై కాదన్నారు రాజ్ నాథ్.