శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. షోపియాన్ జిల్లాలోని జైనపొరా ఏరియాలో భద్రతా దళాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. జైనపొరాలోని చెర్మార్గ్ లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం అందడంతో సెక్యూరిటీ ఫోర్సెస్ కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై టెర్రరిస్టులు దాడి చేశారు. ప్రతిగా వారు కూడా ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు మృతి చెందాడు. అతడు ఏ గ్రూపునకు చెందినవాడనే వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఈ వారం మొదట్లో టీఆర్ఎఫ్ అనే ఉగ్ర సంస్థకు సాయం అందిస్తున్న నలుగురు టెర్రరిస్టు అసోసియేట్లను శ్రీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎఫ్ సంస్థ కశ్మీర్ లోయలో యాక్టివ్ గా ఉందని.. దీనికి పాకిస్థాన్ నుంచి సాయం అందుతున్నట్లు సమాచారం.
#ShopianEncounterUpdate: 01 #terrorist killed. Search going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/jGWjW5YgEA
— Kashmir Zone Police (@KashmirPolice) February 19, 2022
మరిన్ని వార్తల కోసం: