మసీదులో ప్రార్థనలు చేస్తుండగా కాల్పులు.. రిటైర్డ్ పోలీసు అధికారి మృతి

మసీదులో ప్రార్థనలు చేస్తుండగా కాల్పులు.. రిటైర్డ్ పోలీసు అధికారి మృతి

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు పాల్పడ్డారు. షీరీ బారాముల్లాలోని గంత్ముల్లా వద్ద రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ మీర్ మసీదులో అజాన్ ప్రార్థనలు చేస్తుండగా ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయన మరణించారని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

ఈ ఘటనపై కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ లో పోస్టు పెట్టారు. నవంబర్ నెలలో శ్రీనగర్‌లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్‌స్పెక్టర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అతడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీనగర్‌లోని ఈద్గా మైదానంలో ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీ స్థానిక యువకులతో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది