శ్రీనగర్: కశ్మీర్లోయ ప్రశాంతంగానే ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 5 న విధించిన నిషేదాజ్ఞలను దశల వారీగా ఎత్తేస్తున్నట్లు పేర్కొంది. జమ్మూలో ఆంక్షలను దాదాపు పూర్తిగా ఎత్తేశామని, శ్రీనగర్లో అక్కడక్కడా అమలులో ఉన్న ఆంక్షలనూ పంద్రాగస్టు నాటికి సడలించే అవకాశం ఉందని ప్రిన్సిపల్ సెక్రెటరీ రోహిత్కన్సాల్చెప్పారు. ఈద్రోజు అక్కడక్కడా జరిగిన ఆందోళనలు మినహా మంగళవారం పరిస్థితి నార్మల్గానే ఉందన్నారు. పంద్రాగస్టు వేడుకలకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, స్టూడెంట్లు, వివిధ జిల్లాల్లో పోలీసులు డ్రెస్రిహార్సల్స్ కూడా చేస్తున్నారని చెప్పారు. కొత్త యూనియన్ టెరిటరీలో ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా జరుపుతామన్నారు.
కాశ్మీర్లో ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా వీలైనంత వరకు సాయం చేస్తున్నట్లు రోహిత్చెప్పారు. మొబైల్ సర్వీసులను బ్యాన్చేయడంతో పలు ప్రాంతాల్లో 300 పబ్లిక్ఫోన్పాయింట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో ప్రజలు 24 గంటల్లోనే 5 వేల కాల్స్చేసుకున్నారని వివరించారు. మెడికల్సర్వీసులకు ఎలాంటి ఆటంకంలేదన్నారు. ఓపీ, ఇన్పేషెంట్లు, ఆపరేషన్లు యథావిధిగా జరిగిపోతున్నాయని వివరించారు. ఎమర్జెన్సీ మందులు స్టాక్ఉన్నాయని తెలిపారు. ట్విట్టర్, ఫేస్బుక్వంటి సోషల్మీడియా ఫ్లాట్ఫాంలపై ఫేక్న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్సెక్రెటరీ రోహిత్ హెచ్చరించారు. నిందితులను కోర్టు ముందు నిలబెడతామని వార్నింగ్ఇచ్చారు.