ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా హంద్వారా ఏరియాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఈ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా… బాబాగుండ్ గ్రామంలో టెర్రరిస్టులు ఓ ఇంట్లో ఉన్నట్లు గుర్తించాయి భద్రతా దళాలు.

ఆర్మీని చూసిన ఉగ్రవాదులు ఫైరింగ్ చేశారు. దీంతో వెంటనే ఎదురుకాల్పులు చేశారు జవాన్లు. ఈ ఆపరేషన్ లో ముగ్గురు టెర్రరిస్టులు ఆర్మీకి దొరికినట్లు తెలిసింది. దీంతో కాల్పులు నిలిపేసిన భద్రతా దళాలు… ఆ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశాయి. భద్రతా దళాలు – ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.