
అల్పపీడన ప్రభావంతో ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఏటూరు నాగారం మండలంలోని జంపన్నవాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జంపన్న వాగుపై ఉన్న బ్రిడ్జీ కుంగిపోయింది. దొడ్ల గ్రామం వద్ద ఈ ఉదయం వంతెన కూలినట్లు సమాచారం. ఈ వంతెనను జంపన్న వాగుపై 2015లో నిర్మించారు. వంతెన కుంగిపోవడంతో మల్యాల, కొండాయి, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా.. జంపన్న వాగు ఉధృతి వల్ల మేడారం పూర్తిగా జలధిగ్బందంలో ఉంది. సమ్మక్క గద్దెల చుట్టూ నీరు చేరింది.
For More News..