జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా ఉపాధి కల్పనా ఆఫీస్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రైవేట్ కంపెనీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారిణి పి. సాహితి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైద్రాబాద్ కు చెందిన మహేంద్ర అండ్ మహేంద్ర లిమిటెడ్ కంపెనీ లో మొత్తం 300 ఉద్యోగాలకు ట్రైనింగ్ కం ప్లేస్మెంట్స్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అర్హత, ఆసక్తి గలవారు ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలతో 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలు జనగామ మున్సిపల్ కాన్పరెన్స్ హాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సీనియర్ అసిస్టెంట్ జె. గీత సెల్ నంబర్ 7995430401 సంప్రదించాలని తెలిపారు.
