శ్రీలంకతో వన్డే సిరీస్ .. జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంకతో వన్డే సిరీస్ ..  జట్టును ప్రకటించిన బీసీసీఐ

శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటు లభించింది. వెన్నునొస్పి కారణంగా గతేడాది సెప్టెంబరు నుంచి బుమ్రా ఆటకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఫిట్‌గా ఉండటంతో సెలక్టర్లు  జట్టులో బుమ్రాకు చోటు కల్పించారు. 

జనవరి 10 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్టేల సిరీస్ ప్రారంభం కానుంది.  10 న తొలి వన్డే గౌహతిలో , 12 న రెండో వన్డే కోల్ కత్తాలో, 15 న మూడో వన్డే త్రివేడ్రంలో జరగనుంది. అన్ని మ్యాచ్ లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నాం 01.30 నిమిషాలకు ప్రారంభం అవుతాయి.  

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ , హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.