తహసీల్దార్ ఆఫీసుకు కరెంట్ కట్

తహసీల్దార్ ఆఫీసుకు కరెంట్ కట్
  • 8 నెలల బిల్లు బకాయి ఉండటంతో  కనెక్షన్ తీసేసిన విద్యుత్ అధికారులు

జవహర్​నగర్, వెలుగు:  బిల్లు కట్టన్నందుకు జవహర్​నగర్ తహసీల్దార్ ఆఫీసుకు కరెంట్​ను విద్యుత్ అధికారులు నిలిపి వేశారు. 8 నెలలుగా జవహర్​నగర్ తహసీల్దార్ ఆఫీసు అధికారులు కరెంట్ బిల్లు కట్టకపోవడంతో మొత్తం రూ.5,481 బకాయి పడ్డారు.

దీన్ని వెంటనే చెల్లించాలని విద్యుత్ అధికారులు ఎన్నిసార్లు కోరినా తహసీల్దార్ ఆఫీసు అధికారులు స్పందించలేదు. దీంతో శుక్రవారం విద్యుత్ శాఖ ఏఈ ఆదేశాల మేరకు సిబ్బంది తహసీల్దార్ ఆఫీసుకు కనె
క్షన్​ను కట్ చేశారు.