వీడియో: కంగనాను అవమానిస్తూ ప్రశాంత్ భూషణ్ ట్వీట్

వీడియో: కంగనాను అవమానిస్తూ ప్రశాంత్ భూషణ్ ట్వీట్

న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా మరోసారి ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈసారి కంగన పై మరొకరు వ్యంగ్యంగా ట్వీట్ చేయడం గమనార్హం. ప్రముఖ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ కంగనాపై సెటైరికల్ ట్వీట్ చేశారు. మణికర్ణిక మూవీలో కంగన చేసిన గుర్రపు స్వారీకి సంబంధించి ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఝాన్సాకీ రాణి అంటూ దీనికి సరదా క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియోలో సహ నటులతో కలసి కంగన గుర్రాలపై దూసుకెళ్తోంది. అయితే అందరు యాక్టర్లు నిజమైన గుర్రాలపై వెళ్తుండగా.. కంగన మాత్రం చెక్క గుర్రం మీద దౌడు తీస్తోంది. 

ప్రస్తుతం ఈ వీడియో నెట్‌‌లో హల్‌‌చల్ చేస్తోంది. అయితే ఈ ట్వీట్‌‌పై కంగన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రశాంత్ భూషణ్ లాంటి వ్యక్తి ఓ మహిళా ఆర్టిస్ట్ మీద ఇలాంటి వ్యంగ్య ట్వీట్ చేయడంపై పలువురు సీరియస్ అవుతున్నారు. సినిమా కష్టాలపై అవగాహన లేకుండా ఇలా ట్వీట్స్ చేస్తారా? అందులోనూ ఓ మహిళా నటిని అవమానించేలా విమర్శ చేయడం సరికాదంటూ ఫైర్ అవుతున్నారు. ఎంతోమంది మేల్ ఆర్టిస్టుల మేకింగ్ వీడియోలు, ఛేజింగ్ వీడియోలు చూస్తే భూషణ్ ఏమంటారో అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.