న్యూఢిల్లీ/ రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , జేఎంఎం, ఆర్జేడీ కూటమికే విజయావకాశాలున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఐఏఎన్ఎస్ -సీఓటర్ – ఏబీపీ, ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా, కాశిష్ న్యూస్ సర్వేలో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. బీజేపీ రెండో ప్లేస్లో ఉంది. ఏజేఎస్యూ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, ఐదోవిడత అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 70.83 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. 16 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్లో 40.05 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 23న ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ (అసెంబ్లీ: 81 సీట్లు)
పార్టీ బీజేపీ కాంగ్రెస్ కూటమి ఏజేఎస్యూ ఇతరులు
ఐఏఎన్ఎస్-సీఓటర్ – ఏబీపీ 32 35 5 9
ఇండియా టుడే-యాక్సిస్
మై ఇండియా 22-32 38-50 3-5 6 – 11
కాశిష్ న్యూస్ 25-30 37-49 2-4 2-4