జార్ఖండ్ ఎగ్జిట్​పోల్స్ కాంగ్రెస్​ కూటమి వైపే

జార్ఖండ్ ఎగ్జిట్​పోల్స్ కాంగ్రెస్​ కూటమి వైపే

న్యూఢిల్లీ/ రాంచీ:  జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , జేఎంఎం, ఆర్జేడీ  కూటమికే విజయావకాశాలున్నట్టు పలు ఎగ్జిట్​ పోల్స్​ చెబుతున్నాయి.   ఐఏఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ -సీఓటర్‌‌‌‌‌‌‌‌ – ఏబీపీ, ఇండియా టుడే-యాక్సిస్‌‌‌‌ మై ఇండియా, కాశిష్‌‌‌‌ న్యూస్‌‌‌‌ సర్వేలో  కాంగ్రెస్​ కూటమి ముందంజలో ఉంది. బీజేపీ రెండో ప్లేస్​లో ఉంది. ఏజేఎస్​యూ మూడో స్థానంలో ఉంది. మరోవైపు,  ఐదోవిడత  అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి.  70.83 శాతం పోలింగ్‌‌‌‌  నమోదైనట్లు అధికారులు చెప్పారు. 16 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌‌‌‌లో 40.05 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 23న ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి.

ఎగ్జిట్ పోల్స్​ ​ (అసెంబ్లీ: 81 సీట్లు)

పార్టీ                                బీజేపీ      కాంగ్రెస్​ కూటమి                 ఏజేఎస్‌‌‌‌యూ            ఇతరులు

ఐఏఎన్‌‌‌‌ఎస్‌‌‌‌-సీఓటర్‌‌‌‌‌‌‌‌ – ఏబీపీ           32              35           5    9

ఇండియా టుడే-యాక్సిస్‌‌‌‌
మై ఇండియా                  22-32    38-50         3-5          6 – 11

కాశిష్‌‌‌‌ న్యూస్‌‌‌‌                  25-30    37-49         2-4          2-4