ఫైనాన్షియల్ కేటగిరీలో ఎల్‌‌ఐసీ టాప్‌‌ : టీఆర్​ఏ వెల్లడి

ఫైనాన్షియల్ కేటగిరీలో ఎల్‌‌ఐసీ టాప్‌‌ : టీఆర్​ఏ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో  బలమైన టెలికం బ్రాండ్‌‌గా జియో నిలిచింది. తర్వాత ప్లేస్‌‌లో భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌, వొడాఫోన్ ఐడియాలు ఉన్నాయని డేటా ఎనాలసిస్‌‌ కంపెనీ టీఆర్‌‌‌‌ఏ పేర్కొంది. ఈ కంపెనీ తాజాగా ఇండియన్లు ఎక్కువగా కోరుకుం టున్న బ్రాండ్ల లిస్ట్‌‌ను ప్రకటించింది. దీని ప్రకారం,  అపారల్ కేటగిరీలో అడిడాస్ బ్రాండ్ టాప్‌‌లో ఉండగా, నైక్‌‌, రేమండ్‌‌, అలెన్ సోలి, పీటర్ ఇంగ్లండ్‌‌లు తర్వాత ప్లేస్‌‌లలో ఉన్నాయి. ఆటో మొబైల్ లిస్ట్‌‌లో బీఎండబ్ల్యూ టాప్‌‌లో ఉండగా, టయోటా, హ్యుండయ్‌‌, హోండాలు ఆ తర్వాత  ఉన్నాయి.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కేటగిరీలో ఎల్‌‌ఐసీ టాప్‌‌ ర్యాంక్‌‌లో నిలిచింది. ఎస్‌‌బీఐ రెండో ప్లేస్‌‌లో, ఐసీఐసీఐ బ్యాంక్ మూడో ప్లేస్‌‌లో ఉన్నాయి. కన్జూమర్ అప్లియెన్స్‌‌లో కెంట్‌‌ నెంబర్ వన్ పొజిషన్‌‌లో, లివ్‌‌ప్యూర్‌‌‌‌, ఓకయా ఆ తర్వాత ప్లేస్‌‌లలో ఉన్నాయి.