TSPDCL పరిధిలో ఏప్రిల్ 30 ఆదివారం రోజున జరగబోతున్న JLM, AE పరీక్షలను ఒక వారమైనా వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఒకేరోజున ఒక అభ్యర్థి నాలుగు పరీక్షలు ఎట్ల రాస్తారని సీఎం కేసీఆర్ ను ఆయన ప్రశ్నించారు.
వేలాది మంది నిరుద్యోగులు ఈ సమస్యను ఎదురుకుంటున్నా మీకు చీమ కుట్టినట్టుగా కూడా లేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వనందునే ఈ పరిస్థితి ఏర్పడిందిని విమర్శించారు. కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణఅనే హ్యష్ ట్యాగ్ ను జత చేశారు.
https://twitter.com/RSPraveenSwaero/status/1649267415505846273?cxt=HHwWgoDSjb3-r-MtAAAA