పదే పదే కాలేజీలు మారితే బ్లాక్​ లిస్టులో పెడ్తాం

పదే పదే కాలేజీలు మారితే బ్లాక్​ లిస్టులో పెడ్తాం

పదే పదే కాలేజీలు మారితే బ్లాక్​ లిస్టులో పెడ్తాం
ఫ్యాకల్టీకి జేఎన్టీయూ​ వార్నింగ్

హైదరాబాద్​, వెలుగు : పదే పదే కాలేజీలు మారే ఫ్యాకల్టీ మెంబర్స్​ను వర్సిటీలు బ్లాక్​లిస్టులో పెట్టాలని జేఎన్టీ యూ ఆదేశించింది. లెక్చరర్​ లేదా ప్రొఫెసర్లు కాలేజీ నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటే కనీసం 2నెలల ముందు నోటీస్ ఇవ్వాలని వెల్లడిం చింది. విద్యార్థులకు నష్టం కలగకుం డా ఫాకల్టీ మెంబర్స్​సెమిస్టర్ పూర్త య్యేదాకా అదే కాలేజీలో కొనసాగాల ని తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళ వారం జేఎన్టీయూ రిజిస్ట్రార్ సర్క్యు లర్​ను జారీ చేశారు. టీచింగ్, నాన్​ టీచింగ్ ​స్టాఫ్​కోసం కాలేజీ యాజమా న్యాలు ప్రత్యేకంగా సర్వీస్​ రూల్స్​ను రూపొందించాలన్నారు. నియామకం టైంలోనే స్టాఫ్ మెంబర్స్ కు సర్వీస్​ రూల్స్ పేపర్​ను అందించాలని తెలిపారు. సెమిస్టర్​అయిపోయేదాకా ఫ్యా కల్టీని ఉద్యోగం నుంచి తొలగిం చరాదని..ఒకవేళ తొలగిస్తే కాలేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫ్యాకల్టీ మెంబర్స్​ను జేఎన్టీ యూ భయపెడ్తున్నదని తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజీస్ ఎంప్లా యీస్ అసోసియేషన్ (టీఎస్​టీసీ ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సం తోష్​ కుమార్​ఆరోపించారు. సర్క్యుల ర్​ను వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్​చేశారు. ఉద్యోగులకు కాలేజీలు ప్రతి నెలా తప్పనిసరిగా జీతాలు చెల్లించేలా జేఎన్టీయూ రూల్స్​ రూపొందించాలని కోరారు.